Breaking News

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, సముద్ర మార్గాల రవాణాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఇంధనం, వంటగ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత్‌కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.

India, Oman మధ్య కుదిరిన తాజా ఒప్పందం మేరకు ఒమన్‌లోని ప్రధాన నౌకాశ్రయాల నుంచి భారత్‌కు ఇంధనం, సహజవాయువు సరఫరా నిరంతరంగా కొనసాగనుంది. దీంతో దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశాలు తగ్గనున్నాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఈ ఒప్పందం వల్ల పెట్రోలు, వంటగ్యాస్ సరఫరా వ్యవస్థ మరింత స్థిరపడుతుందని, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కొరత భయంతో ప్రజలు అధికంగా కొనుగోలు చేసే పరిస్థితులు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.దేశ ఇంధన భద్రతకు ఈ ఒప్పందం కీలకంగా మారనుందని అధికారులు పేర్కొంటున్నారు.

విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *