Breaking News

Asha workers met Minister Lokesh at Visakhapatnam Airport

విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రి లోకేష్‌ను కలిసిన ఆశా వర్కర్లు

ఆశా వర్కర్ల భద్రతపై హామీ || Asha workers met Minister Lokesh at Visakhapatnam Airport  ||

📍 విశాఖపట్నం: రాష్ట్రంలోని ఆశా వర్కర్ల (ASHA Workers) ఉద్యోగ భద్రతపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హామీ ఇచ్చారు. శనివారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో మంత్రిని ఆశా వర్కర్లు కలిసి తమ సమస్యలను వివరించారు.

ఆశా వర్కర్ల వినతిపత్రం – ప్రధాన డిమాండ్లు

👉 మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని
👉 ఉద్యోగ భద్రత కల్పించాలని
👉 వేతనాలు వ్యక్తిగత అకౌంట్లలో జమ చేయాలని

ఈ అంశాలపై స్పందించిన మంత్రి లోకేష్, “ఆశా వర్కర్లను తొలగించే ప్రసక్తే లేదు. మీ ఉద్యోగ భద్రతకు భరోసా ఇస్తున్నాం” అని స్పష్టం చేశారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒత్తిళ్లు – ఆశా వర్కర్ల ఆరోపణలు

📌 టీడీపీ కార్పొరేటర్లు తమను తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
📌 గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో కండువా వేసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నామంటే.. అదంతా అధికారుల ఒత్తిడి వల్లే అని వివరణ ఇచ్చారు.
📌 “యూసీడీని (UCD) వైసీపీ పార్టీ యంత్రంగా మార్చారు” అని వారు ఆరోపించారు.

“రాజకీయాల్లోకి లాగొద్దు – ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించండి”

📍 “మాకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించండి.. రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని వాడుకోవద్దు” అని ఆశా వర్కర్లు మంత్రి లోకేష్‌ను కోరారు.

ఈ వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో ఆశా వర్కర్లలో సంతోషం వ్యక్తమవుతోంది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇవ్వడం గమనార్హం.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *