Breaking News

'Do you want to leave all this and go to the Himalayas?'

‘ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నారా?’

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో **డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)**తో స్టేజీపైనే ముచ్చటించారు.

ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసినా వారి మధ్య ప్రత్యేక అనుబంధం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. గతంలోనూ మోదీ పవన్‌ను “తుఫాన్” తో పోల్చి ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రావడంతో పవన్‌కు మరింత ప్రాధాన్యత పెరిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో మోదీ, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సంభాషణ గురించి మీడియా పవన్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన నవ్వుతూ స్పందించారు.

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

“ప్రధాని మోదీ నాతో చిన్న జోక్ చేశారు. ‘ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నారా?’ అని అడిగారు. అందుకు నేను ‘ఇంకా చాలా టైమ్ ఉంది’ అని చెప్పాను. దానికి మోదీ ‘నువ్వు చేయాల్సిన పని చెయ్’ అని అన్నారు” అని పవన్ కళ్యాణ్ వివరించారు.

సనాతన ధర్మ పరిరక్షణ పేరిట పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాల కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఆయన మద్దతు కీలకంగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని మోదీతో పవన్ సంబంధాలు మరింత బలపడటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకోనుందని అంటున్నారు విశ్లేషకులు. ముందు మోదీ ఇచ్చిన సూచనల మేరకు తన పనిని కొనసాగించనున్నట్లు పవన్ వ్యాఖ్యలు వెల్లడించాయి.

భారత జాతీయ రహదారుల అథారిటీ కీలక నిర్ణయం.. హైవేలపై AI నిఘా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *