బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఎస్సీ వర్గీకరణ వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలి

|| Madiga caste should be vigilant till SC classification ||: మందకృష్ణ మాదిగ

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లోకి వెళ్లి అన్ని విషయాలను స్పష్టంగా వివరించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. తమ హక్కుల కోసం మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని కోరారు.

“వర్గీకరణలో శాస్త్రీయత లేదు”

సికింద్రాబాద్ బాలంరాయిలోని డ్రీమ్‌ల్యాండ్ గార్డెన్‌లో సోమవారం జరిగిన ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయత లేకుండా ఉందని విమర్శించారు. అన్ని కులాల్లో అసంతృప్తి నెలకొని ఉందని, అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

“58 కులాలు వర్గీకరణ కోరుతున్నాయి”

మాలలు మినహా ఎస్సీల్లోని మిగతా 58 కులాలు వర్గీకరణను కోరుతున్నాయని మందకృష్ణ మాదిగ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పూర్తిగా అధ్యయనం చేయకుండానే ఎస్సీ వర్గీకరణను ఆమోదించిందని ఆరోపించారు. అశాస్త్రీయంగా అమలు చేస్తున్న వర్గీకరణలోని తప్పులు సవరించి, అందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

సమావేశంలో పాల్గొన్న నేతలు

ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ అధ్యక్షత వహించగా, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీసీ నేత డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, సయ్యద్ ఇస్మాయిల్, హోలియా దాసరి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు, ఎంఎ్‌సఎఫ్ జాతీయ అధికార ప్రతినిధి సోమశేఖర్, కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ, తమ న్యాయమైన హక్కుల కోసం నిరంతరం పోరాడతామని ఎమ్మార్పీఎస్ నేతలు స్పష్టం చేశారు.