Breaking News

Pepper farmers should be supported.. - Former Minister Errabelli

మిర్చి రైతులను ఆదుకోవాలి.. – మాజీ మంత్రి ఎర్రబెల్లి

మిర్చి రైతులను ఆదుకోవాలి.. క్వింటాకు ₹25,000 మద్దతు ధర ఇవ్వాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి

వరంగల్: రాష్ట్రంలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. మిర్చికి క్వింటా ₹25,000 మద్దతు ధర ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఎనుమాముల మార్కెట్‌లో ఎర్రబెల్లి పర్యటన

వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన ఎర్రబెల్లి, అక్కడి రైతులతో మాట్లాడి పంటల పరిస్థితులు తెలుసుకున్నారు. రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

“కేసీఆర్ హయాంలో రైతులు రాజుల్లా బతికారు”

బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. “మాజీ సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు. ఆయన హయాంలో రైతులు రాజుల్లా బతికారు” అని అన్నారు. కాని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూరియా కొరత, మద్దతు ధరల సమస్యలు తలెత్తాయని విమర్శించారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

బీఆర్ఎస్ తరఫున ఆందోళన హెచ్చరిక

“మిర్చి రైతులకు న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. క్వింటాకు ₹25,000 మద్దతు ధర ప్రకటించాలి. లేదంటే వారం రోజుల్లో బీఆర్ఎస్ తరఫున రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం” అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

రైతులను మోసం చేసిన కాంగ్రెస్, తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాలపై రైతుల అసంతృప్తి పెరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *