హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం
న్యూఢిల్లీ:
జాతీయ రహదారుల పక్కనే ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్-2024’ పథకంలో భాగంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి పై దృష్టి
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖతో NHAI ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈవీ వాహనాల వాడకం పెరుగుతోన్న నేపథ్యంలో, హైవే ల వెంట ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ప్రయాణికులకు గమ్యస్థానాల మధ్య మరింత సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈవీ విప్లవానికి బాసటగా కేంద్రం
కేంద్రం చేపట్టిన ఈ పథకం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత ప్రోత్సహించబడుతుందని, దీని ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు తోడ్పాటవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.
