ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే ఎంతటి నాయకులైనా సస్పెన్షన్కు గురవుతారని తేల్చిచెప్పారు. ఇటీవల నరసారావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు పోస్టింగ్ వ్యవహారంపై వివాదం రేగిన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు తెచ్చే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
