ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లు దేశ ప్రజల ఆశయాలకు అనుకూలంగా లేదని ఆయన పేర్కొన్నారు. ఓబీసీలు, దళితులు హిందువులేనని చెప్పుకుంటూ వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలమవుతున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.ఈ బిల్లుతో దక్షిణాది, ఈశాన్య మరియు చిన్న రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ దీర్ఘకాలిక రాజకీయ లాభాల కోసం ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.హిందూ పార్టీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, దేశ విలువలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
