మే 16, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షకు హాజరైన 23,198 మంది అభ్యర్థుల్లో 21,205 మంది అర్హత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.41గా నమోదైంది.రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష కీలకంగా మారడంతో విద్యార్థులు భారీగా హాజరయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు, ర్యాంక్ కార్డులు పొందవచ్చని అధికారులు వెల్లడించారు. అదనంగా 9552300009 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపి కూడా ఫలితాలను తెలుసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.ఫలితాల అనంతరం త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వెబ్ ఆప్షన్స్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, కాలేజీ ఎంపిక వంటి ప్రక్రియల ద్వారా విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఉన్నత విద్యతో మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
