Breaking News

నేడు నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేలు

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రంలోని లక్షలాది మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతి పంపిణీ చేయనున్నారు.ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. మొత్తం రూ.262 కోట్లను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో సీఎం జమ చేయనున్నారు.కావలిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని నిధులను విడుదల చేస్తారు. అనంతరం మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.అలాగే జిల్లాలో పార్టీ బలోపేతంపై టీడీపీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *