మే 19, (నేటి తెలుగు పత్రిక): వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పెండింగ్ లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంల సీఎండీలకు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ కనెక్షన్లను వేగంగా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.సోమవారం డిస్కంల సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, విద్యుత్ సరఫరా వ్యవస్థపై సమీక్ష చేశారు. వేసవిలో అధిక డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్తు అంతరాయాలు లేకుండా సరఫరా కొనసాగించాలని సూచించారు. లోవోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని, సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి ఘటనలు జరగకుండా క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
