మే 20, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుైంది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ శేషయ్య తెలిపారు.మే 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన వైసీపీ ధర్నా సందర్భంగా మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించడంతో పాటు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని మంత్రి తన ఫిర్యాదులో వెల్లడించారు.ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ప్రసంగాల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
