మే 21, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపాదించిన ‘మావిగన్’ అంశం ప్రస్తావనకు వస్తే చంద్రబాబుకు భయం పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. “నిద్రలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా మావిగన్ పేరు చెబితే ఆయన ఉలిక్కిపడే పరిస్థితి ఉంది” అంటూ విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్, చంద్రబాబు నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అంశం ఇంకా అనిశ్చితిలోనే ఉందని ఆరోపించారు.
