మే 21, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ నేతలు తరచూ చేస్తున్న “గొడ్డలి పార్టీ” వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తమ కుటుంబంపై జరుగుతున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“మా తాత రాజారెడ్డిని హత్య చేసింది టీడీపీ నేతలు కాదా? మా కుటుంబంలో ముగ్గురు హత్యా రాజకీయాలకు బలైపోయారు” అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ.. “వివేకాను చంపిన దస్తగిరి తరఫున వాదిస్తున్న సిద్ధార్థ లూథ్రానే చంద్రబాబు తరఫు న్యాయవాది కూడా” అని వ్యాఖ్యానించారు.“ఎవరిది గన్ కల్చర్? ఎవరిది హత్యా రాజకీయాలు? శవ రాజకీయాలు చేసే పార్టీ ఎవరిది?” అంటూ టీడీపీపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
