Breaking News

జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు.. “వక్రీకరణ రాజకీయాలు చేస్తున్నారు”

అమరావతి, మే 22, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ వక్రీకరణలే అని మండిపడ్డారు.తమ కుటుంబంలో జరిగిన మరణాలకు సీఎం చంద్రబాబు కారణమని జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శించారు.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వైఎస్ కుటుంబ చరిత్రపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివిధ హత్య కేసులు, రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, గత ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు అసలు వాస్తవాలు ఇప్పటికే తెలుసని అన్నారు.అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. “తిరుమల వేంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఫలితం మంచిది కాదని మాత్రమే చంద్రబాబు అన్నారు” అని స్పష్టం చేశారు.గతంలో వైఎస్ మరణంపై జరిగిన ప్రచారాలను కూడా గుర్తు చేస్తూ, ఇప్పుడు వాటిని మళ్లీ రాజకీయంగా వాడుకోవడం సరికాదని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, ఆ కేసులో నిజాలు ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.జగన్ ఇకనైనా ఇలాంటి వక్రీకరణ రాజకీయాలు మానుకోవాలని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.

పెన్షన్ల అంశంలో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అభినయ్ దర్శన్ వ్యవహారంపై విచారణ.. హోం మంత్రి అనిత వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *