Breaking News

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా..

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా.. నాలుగో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య పోటీ కొనసాగుతోంది.ఈరోజు మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్, కోల్‌కతా ఆశలు సజీవంగా ఉంటాయి.రాత్రి జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కేకేఆర్ ఓడిపోతే పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. అయితే కోల్‌కతా క్వాలిఫై కావాలంటే ఢిల్లీపై భారీ తేడాతో గెలిచి నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. దీంతో నేటి రెండు మ్యాచ్‌లు ప్లేఆఫ్స్ రేసును పూర్తిగా మార్చే అవకాశముంది.

SRH సెన్సేషనల్ రికార్డు.. 220+ స్కోర్లలో 100% విజయాలతో చరిత్ర

తొలి 10 మ్యాచ్‌ల్లో వికెట్‌ ఫీట్.. సాకిబ్ హుస్సేన్ రికార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *