మే 25, (నేటి తెలుగు పత్రిక): ఈడీ నోటీసుల అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వివరణ ఇచ్చారు. ఇశాన్వీ, కేశినేని డెవలపర్స్ కలిసి ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు మాత్రమే ఈడీ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు.2021లో పక్కపక్క సైట్లు ఉండటంతో ఇశాన్వీ సంస్థతో కలిసి ‘ప్రైడ్ ఇన్ఫ్రా’ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించామని చెప్పారు. ఆ సంస్థ ద్వారా రూ.35 లక్షల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు.రాజ్ కసిరెడ్డి వ్యవహారం తెలిసిన తర్వాత 2022లోనే ఆ కంపెనీ నుంచి తాము బయటకు వచ్చేశామని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఆర్కిటెక్ట్ ఫీజుకు సంబంధించిన రూ.35 లక్షల ట్రాన్సాక్షన్పైనే ఈడీ వివరణ కోరుతోందని పేర్కొన్నారు.ఈ నెల 27న ఈడీ అధికారులకు పూర్తి వివరాలు అందజేస్తామని తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్లో తన భార్యకు నోటీసులు వచ్చాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ఆమె అప్పట్లో కంపెనీలో డైరెక్టర్గా మాత్రమే ఉన్నారని, వ్యక్తిగతంగా ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.
