మే 25, (నేటి తెలుగు పత్రిక): దేశ, విదేశీ కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరు చిన్నారులతో సరదాగా గడిపిన క్షణాలు ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని సేవా తీర్థ్లో ఆ చిన్నారులతో సమయం గడిపిన మోదీ వారిని ఆడిస్తూ, నవ్విస్తూ మమేకమయ్యారు.ఈ సందర్భంగా తీసిన క్యూట్ ఫొటోలను ప్రధాని మోదీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ చిన్నారులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిల్లలు కావడం విశేషం.నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన భార్యతో కలిసి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా చిన్నారులతో మోదీ సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
