మే 25, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారీ భారం పడుతోందని మండిపడింది.సోషల్ మీడియా వేదికగా స్పందించిన కాంగ్రెస్.. “ఇన్ఫ్లేషన్ మ్యాన్ మోదీ” అంటూ ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసింది. మే 15 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు రూ.8 వరకు పెంచారని ఆరోపించింది.పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజలపై ధరల భారం పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించింది.
