Breaking News

ఎల్లుండి వైసీపీ కీలక సమావేశం.. జగన్ దిశానిర్దేశం

తాడేపల్లి, మే 25, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, పార్టీ కమిటీల నిర్మాణం, ఎస్‌ఐఆర్‌ అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *