Breaking News

మహానాడు వేదికగా రెండేళ్ల విజయాలు ప్రజల్లోకి: అచ్చెన్నాయుడు

మే 27, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ మహానాడు కార్యకర్తల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదిక అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను మహానాడు వేదికగా ప్రజల ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ‘స్త్రీశక్తి’ నినాదంతో నిర్వహిస్తున్న మహానాడు-2026 నవశకానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై ఈ మహానాడులో ప్రధానంగా చర్చ జరుగుతుందని వివరించారు. అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించే దిశగా మహానాడు సాగుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మహిళా శక్తి, యువశక్తిని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, అదే దిశలో మహానాడు-2026 కొత్త ఆలోచనలకు వేదిక కానుందని తెలిపారు.

రైతులకు కొత్త దిశ.. ‘ఫార్మ్ టు హోమ్’ విధానంపై సీఎం చంద్రబాబు ఫోకస్

నేటి నుంచి మహానాడు.. 2029 ఎన్నికలపై టీడీపీ ఫోకస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *