మే 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరస్పర సహకారం, సమయానికి అనుమతులు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.మధ్యప్రదేశ్–ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య అమలవుతున్న కెన్–బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటే పెద్ద ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని తెలిపారు.ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో జాప్యం జరిగితే వ్యయం భారీగా పెరుగుతుందని, ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు ఆలస్యంగా చేరుతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు మోదీ తెలిపారు. ప్రాజెక్టుల అమలులో ఆధునిక సాంకేతికత వినియోగం, సమయపాలన, రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకమని ఆయన స్పష్టం చేశారు.
