Breaking News

ఉద్యోగం వచ్చాక భర్తకు షాక్.. మరో వ్యక్తితో సంబంధం!

మే 29, (నేటి తెలుగు పత్రిక): బిహార్‌లోని హాజీపుర్‌లో కుటుంబాన్ని కలిచివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య తనను వదిలేసి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని భర్త అమన్ ఆరోపించాడు.ఇంటర్ మాత్రమే చదివిన భార్యను ఉన్నత చదువులు చదివించేందుకు తన సొంత భూమిని అమ్మేశానని అమన్ వాపోయాడు. కష్టపడి చదివించి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేశానని తెలిపాడు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని ఆరోపించాడు.శిక్షణ సమయంలో పరిచయమైన కాలేజ్ స్నేహితుడితో భార్యకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని, అనంతరం తనను దూరం పెట్టిందని పేర్కొన్నాడు. తనపై తప్పుడు కేసులు కూడా పెట్టిందని, చిన్న కుమారుడిని సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కుటుంబ వివాదంపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

శోలింగర్‌లో నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

సిద్దరామయ్య ప్రస్థానం స్ఫూర్తిదాయకం: డీకే శివకుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *