Breaking News

సినీ నటుడు ప్రకాష్ రాజ్ తల్లి కన్నుమూత – పవన్ కళ్యాణ్ సంతాపం

బెంగుళూరు, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి, శ్రీమతి సువర్ణలత, వయోభార సమస్యల కారణంగా మరణించారు. నేటి ఉదయం బెంగుళూరులోని స్వగృహంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి.కుటుంబ సభ్యులు తెలిపినట్లుగా, గత కొంతకాలంగా సువర్ణలత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ సంఘటనతో ప్రకాష్ రాజ్ ఇంట విషాదం నెలకొంది. సినీ రంగంలో తన ప్రత్యేక స్థానం సంపాదించిన ప్రకాష్ రాజ్ కు అభిమానులు, సహకారులు సంతాపం తెలియజేస్తున్నారు.సినీ ప్రముఖులతో పాటు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, హీరో పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ లో, “ప్రకాష్ రాజ్ గారి తల్లి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి తీవ్ర చింత చెందాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొన్నారు.ప్రకాష్ రాజ్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, సినీ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *