న్యూఢిల్లీ, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: జంతర్ మంతర్ వద్ద బీసీ, ఓబీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్ల విషయంలో వివిధ పార్టీలు ధర్నా నిర్వహిస్తున్నాయి. ఈ రోజు బీసీ సమాజ హక్కుల కోసం మరియు ప్రత్యేక మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఆందోళన నిర్వహించడం జరుగుతోంది.శ్రీ నారగోని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో శ్రీమతి పొట్లూరి దేవి ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ జస్టిస్ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, కొండిశెట్టి ఉమాదేవి, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ అధ్యక్షులు కోటా వెంకన్న, మాచర్ల శ్రీనివాస్ రాజ్యాధికారపాటి స్టేట్ జనరల్ సెక్రెటరీ , ఆదిమూల గురుస్వామి బీసీ సంఘర్షణ సమితి స్టేట్ కన్వీనర్ , మరియు 200 మంది సభ్యులతో ధర్నా నిర్వహించడం జరుగుతోంది.
