పార్లమెంట్లో ఎంపీల మధ్య తోపులాట: లోక్సభ, రాజ్యసభ వాయిదా
ఢిల్లీ:
పార్లమెంట్లో MPs మధ్య జరిగిన తోపులాట కారణంగా లోక్సభ మరియు రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్తుల గాయపడటంతో, ఎన్డీయే నేతలు రాహుల్ గాంధీపై ఎఫ్ఆర్ నమోదు చేయాలని నిర్ణయించుకున్నారు.
స్పీకర్కు ఖర్గే లేఖ
ఈ ఘటనపై, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు, విచారణ జరపాలని కోరారు.
పార్లమెంట్లో MPs మధ్య తోపులాట
అంబేడ్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు, వాజపేయి-కమలం వివాదంపై కాంగ్రెస్ మరియు బీజేపీ ఎంపీలు తీవ్రంగా నిరసన చేపట్టారు. ఈ నిరసనలో గాయపడిన ప్రతాప్ సారంగిని ఆస్పత్రికి తరలించారు.
రాహుల్ గాంధీ స్పందన
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “పార్లమెంట్ లోపలికి వెళ్లే హక్కు మాకు ఉంది, బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునే ప్రయత్నించారు,” అని తెలిపారు.
