మే 15, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలో మహిళపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. మంగోల్పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళ మే 11 రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెను స్లీపర్ బస్సులోకి బలవంతంగా ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను నాంగ్లోయ్ ప్రాంతానికి తీసుకెళ్లి దాదాపు రెండు గంటల పాటు హింసించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
