మే 16, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. “తాను సీఎం కావాలని పార్టీ పెట్టలేదు” అని పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “మీరు సీఎం కావాలని కాదు.. ఎవరో సీఎం కావాలని పార్టీ పెట్టారని మాకు ఎప్పుడో తెలుసు. కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది” అంటూ చురకలు అంటించారు.పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిపై విమర్శలు గుప్పించిన అంబటి, జనసేన స్వతంత్ర రాజకీయ పార్టీలా కాకుండా ఇతర పార్టీలకు మద్దతుగా వ్యవహరిస్తోందనే భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. రాజకీయాల్లో నాయకత్వంపై స్పష్టత అవసరమని, సీఎం కావాలనే లక్ష్యంతోనే పార్టీలు పనిచేయాలని వ్యాఖ్యానించారు.
