Breaking News

“రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది?” – వైఎస్ షర్మిల ప్రశ్న

మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, అయితే అలాంటి పరిస్థితుల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎందుకు క్షీణిస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.డాలర్ విలువ తొలిసారిగా రూ.96 దాటడం దేశ ఆర్థిక పరిస్థితికి సంకేతమని షర్మిల వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్ మిత్రదేశాల నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసేదని, కానీ ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా అధిక ధరలకు చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని అన్నారు. దీంతో భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యం దేశం నుంచి బయటకు వెళ్తోందని విమర్శించారు.“మోదీ ప్రభుత్వం బలమైన ఆర్థిక విధానాలు అమలు చేస్తోందంటే రూపాయి విలువ పాతాళానికి ఎందుకు పడిపోతోంది?” అని షర్మిల ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కంటే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు.

“కాకినాడ రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి”

“స్వచ్ఛమైన పెనుకొండ కోసం ప్రజల సహకారం తప్పనిసరి” – మంత్రి సవిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *