మే 17, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి విడదల రజిని తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు పాస్పోర్ట్ను పోలీసులకు సమర్పించారు. ఆదివారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆమె అధికారులకు పాస్పోర్ట్ను అప్పగించారు.టీడీపీ నేత పిల్లి కోటి ఫిర్యాదు మేరకు యడ్లపాడు పోలీసులు విడదల రజిని, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు భయంతో ఆమె హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ పాస్పోర్ట్ను సమర్పించాలని షరతు విధించింది.కోర్టు ఆదేశాలను పాటిస్తూ డీఎస్పీ హనుమంతరావుకు పాస్పోర్ట్ను అందజేసిన రజిని, విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.రజిని రాక నేపథ్యంలో డీఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసుపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగా, పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు సమాచారం.
