Breaking News

ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదు: ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల సంస్థ ప్రైవేటీకరణ జరుగుతుందన్న ప్రచారాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఖండించింది. ఈ బస్సుల రాకతో ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసింది.పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి 1,050 ఎలక్ట్రిక్ బస్సులు అందనున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు సురక్షితమైన, పర్యావరణహితమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఆధునిక సదుపాయాలతో కూడిన ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవం కల్పించేందుకు ఆర్టీసీ కట్టుబడి ఉందని సంస్థ వెల్లడించింది.

“ఈ జన్మకి చాలు”.. పవన్‌ను కలిసిన తనీష్ భావోద్వేగ పోస్ట్

తిరుమలలో పెట్రోల్ వాహనాలకు టోల్?.. గ్రీన్ జోన్‌గా మారనున్న కొండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *