మే 18, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్లో అద్భుత ఆరంభం చేసిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో పడింది. తొలి ఏడు మ్యాచుల్లో దాదాపు అజేయంగా దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్ సేన.. తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది.తాజాగా ఆర్సీబీ చేతిలో ఎదురైన పరాజయం తర్వాత పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ డగౌట్లో ఒంటరిగా కూర్చున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జట్టు వరుస వైఫల్యాలతో తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపించిన పాంటింగ్ ఫొటోపై అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.ఒక దశలో టైటిల్ ఫేవరెట్గా కనిపించిన పంజాబ్.. ఇప్పుడు మిగిలిన మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
