Breaking News

మధురైలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆలయ దర్శనం ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.పోలీసుల వివరాల ప్రకారం.. మధురై అన్నానగర్‌కు చెందిన ప్రకాశ్, రమేశ్‌తో పాటు కుటుంబ సభ్యులు తిరుచిరాపల్లిలోని సమయపురం మరియమ్మన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధురైకి తిరిగి వస్తుండగా మేలూరు సమీపంలోని అయ్యపట్టి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.అధిక వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఇనుప బ్యారియర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమై, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ప్రమాదానికి అధిక వేగమా, డ్రైవర్ అలసటా, లేక సాంకేతిక లోపమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *