మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులందరికీ శుభాకాంక్షలు చెప్పారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. కేరళ నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆకాంక్షించారు. పారదర్శకత, ప్రగతిశీల విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. “దేవుని సొంత దేశం”గా పేరుగాంచిన కేరళ మరింత అభివృద్ధి, సుసంపన్నత సాధించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
