Breaking News

వివేకా కేసుపై జగన్ హస్తం ఉందా? ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్

అమరావతి, మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ హస్తం ఉందా లేదా అన్న అంశంపై “ఓపెన్ పోలింగ్” నిర్వహించాలని ఆయన సవాల్ విసిరారు.ఈ కేసులో తన ఆరోపణలు తప్పని తేలితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా రమేశ్ ప్రకటించారు. ప్రజలకు ఇప్పటికే నిజాలు తెలిసిపోయాయని, కేసు దర్యాప్తు అంశాలు అనేక విషయాలను బయటపెట్టాయని ఆయన అన్నారు.వైఎస్ కుటుంబ చరిత్రపై కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసు, సీబీఐ దర్యాప్తు, అరెస్టులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ జగన్‌పై విమర్శలు గుప్పించారు.

నిరుద్యోగులను తప్పుదారి పట్టించే కుట్ర: భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి

2027 నాటికి శంకర్‌విలాస్ బ్రిడ్జి పూర్తి: పెమ్మసాని చంద్రశేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *