మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్, సాక్షి మీడియా చేస్తున్న ప్రచారాలు విఫలమవడంతో ఇప్పుడు నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. అక్రమాలంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ వ్యవహారం కోర్టుల వరకు వెళ్లిందని గుర్తు చేశారు.క్రీడాకారుల కోటా ఉద్యోగాలు కూడా ఎలాంటి అవినీతి లేకుండా ఇచ్చామని భూమిరెడ్డి తెలిపారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు విఫలమవడంతో ఇప్పుడు నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ అండ్ కో చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.
