Breaking News

నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవు: సీఎం విజయ్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో 10 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘోర నేరాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు.ఈ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన విజయ్.. ఇలాంటి కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరాలు చేయాలంటేనే భయపడేలా శిక్షలు ఉండాలని పేర్కొన్నారు.మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సీఎం విజయ్ స్పష్టం చేశారు.

రామ్మోహన్ నాయుడు పిల్లలతో మోదీ సందడి

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్.. “ప్రజల జేబుల దోపిడీ ఆగడం లేదు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *