మే 25, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత సోషల్ మీడియాలో తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరిగాయని హెడ్ భార్య జెస్సికా ఆవేదన వ్యక్తం చేశారు. ‘2023 వరల్డ్కప్ తర్వాత ఎదుర్కొన్న ట్రోలింగ్ మళ్లీ మొదలైంది. “Your father is King Kohli” అంటూ కామెంట్లు చేస్తున్నారు. రేప్ చేస్తామని, దాడులు చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. మా కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా దూషిస్తున్నారు’ అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
