Breaking News

మోదీ అనుబంధంపై ‘అప్నాపన్’ పుస్తకం ఆవిష్కరణ.. కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలో నిర్వహించిన ‘అప్నాపన్: మై ఎక్స్‌పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన ఈ పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ప్రజలతో ఆయన అనుబంధంపై తన అనుభవాలను వివరించారు.భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా టీడీపీ మహానాడు: పల్లా శ్రీనివాసరావు

మహిళా శక్తితో మహానాడు.. రికార్డు లక్ష్యంగా టీడీపీ: బోండా ఉమామహేశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *