మే 26, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలో నిర్వహించిన ‘అప్నాపన్: మై ఎక్స్పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన ఈ పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ప్రజలతో ఆయన అనుబంధంపై తన అనుభవాలను వివరించారు.భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
