మే 27, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైన ఓబీసీ నేతగా ఆయనను ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్న సోషల్ జస్టిస్ అజెండాలో భాగంగా సిద్దరామయ్యను రాజ్యసభకు పంపించి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై జరిగిన చర్చల అనంతరం ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
