మే 28, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని లోక్భవన్లో రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత డీకే శివకుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే సీఎం పదవికి రాజీనామా చేసినట్లు సిద్దరామయ్య వెల్లడించారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా లేఖను కార్యదర్శికి అందజేసినట్లు తెలిపారు. గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించే అవకాశం ఉందన్నారు.పార్టీ అధిష్ఠానం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వర్తిస్తానని సిద్దరామయ్య స్పష్టం చేశారు.
