మే 29, (నేటి తెలుగు పత్రిక): జూన్ ఇరవై ఒకటో తేదీన జరగనున్న నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.పరీక్షకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పర్యవేక్షణతో పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.
