Breaking News

కల్తీ మద్యం విషాదం.. 18 మంది మృతి

మే 30, (నేటి తెలుగు పత్రిక): మహారాష్ట్రలో కల్తీ మద్యం మరోసారి ప్రాణాంతకంగా మారింది. పుణే జిల్లాలో మిథనాల్ కలిపిన నకిలీ మద్యం సేవించిన కారణంగా గత 48 గంటల్లో 18 మంది మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మరికొందరు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.అధికారుల సమాచారం ప్రకారం, బాధితులు మద్యం సేవించిన కొద్దిసేపటికే తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, చూపు మందగించడం వంటి లక్షణాలతో బాధపడ్డారు. పరిస్థితి విషమించడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక విచారణలో మద్యంలో అధిక మోతాదులో మిథనాల్ కలిపినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.ఘటనపై వెంటనే స్పందించిన ఎక్సైజ్, పోలీసు శాఖలు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక దాడులు చేపట్టాయి. నకిలీ మద్యం తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.కల్తీ మద్యం తయారీలో ఉపయోగించిన రసాయనాలు, సరఫరా మార్గాలు, పంపిణీ వ్యవస్థపై దర్యాప్తు కొనసాగుతోంది. మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు అనధికారికంగా విక్రయించే మద్యం కొనుగోలు చేయవద్దని, అనుమానాస్పద మద్యం విక్రయాలపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఎక్సైజ్ శాఖ విజ్ఞప్తి చేసింది. కల్తీ మద్యం కారణంగా వరుస మరణాలు సంభవించడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది.

దేవుడి ముందు అందరూ సమానమే.. వీఐపీ దర్శనాలెందుకు?: మద్రాస్ హైకోర్టు

కర్ణాటక కోటాలో షర్మిలకు రాజ్యసభ అవకాశం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *