Breaking News

Rave party raided by police

రేవ్ పార్టీపై పోలీసుల దాడి

తూర్పుగోదావరిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 19 మంది అరెస్ట్

తూర్పుగోదావరి, డిసెంబర్ 29: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలో కల్యాణ మండపంలో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపింది. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీపై తెల్లవారుజామున పోలీసులు స్పెషల్ రైడ్ నిర్వహించి, 19 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఆరెస్టైనవారిలో ఐదుగురు మహిళలు

ఈ దాడిలో ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

అమరావతి పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కీ పూర్తి కాదంటూ విమర్శలు

ఫెర్టిలైజర్ కంపెనీ ఉద్యోగులుగా అనుమానం

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన ఉద్యోగులుగా గుర్తించారు. వారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చి పార్టీలో పాల్గొన్నట్లు వెల్లడైంది.

పోలీసుల హెచ్చరిక

రేవ్ పార్టీలు, డ్రగ్స్ వంటి అక్రమ కార్యక్రమాలను సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పూర్తి వివరాలను ఇంకా విచారిస్తున్నట్లు సమాచారం.

జూన్‌లో తల్లికి వందనం నిధులు.. విద్యార్థుల కుటుంబాలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *