ఆర్బీఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం
హైదరాబాద్: డిసెంబర్ 09
ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ స్థానంలో నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీయ్యాయి.
శక్తి కాంత్ దాస్ యొక్క పదవీకాలం డిసెంబర్ 10, 2024 న ముగియనుండగా, అతని స్థానంలో సంజయ్ మల్హోత్రా నూతన ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్హోత్రా, 26వ గవర్నర్గా నియమితులయ్యారు.
సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి అత్యంత కీలకమైన ఈ బాధ్యతను అప్పగించి ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్గా తన బాధ్యతలను నిర్వహించనున్నారు.
