మార్చి 30, నేటి తెలుగు పత్రిక: గుంటూరు జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి ఆరోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు కుటుంబంతో కలిసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.సాతులూరుకు చెందిన గోపి, శంకరకుమారి దంపతుల కుమార్తె మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతూ ఉండగా, చికిత్స కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు తీవ్ర నిరాశకు లోనైనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో కుటుంబం ఓ లాడ్జ్కు వెళ్లి మత్తు ఇంజెక్షన్లు తీసుకుంది. ఈ ఘటనలో భార్య, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, గోపి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోలీసుల దర్యాప్తులో ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంకేతాలు లభించాయి. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు.
