Breaking News

సిమ్ లేకపోయినా వాట్సప్, టెలిగ్రామ్ వాడొచ్చు: కేంద్రం సిమ్ బైండింగ్ అమలుకు గడువును పొడిగిస్తోంది

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: సోషల్ మీడియా యాప్స్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనల అమలుకు గడువును మరింత పొడిగించనుంది.సైబర్ నేరాలను అరికట్టేందుకు ఈ నిబంధనలను కేంద్రం గతంలో ప్రవేశపెట్టింది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే, ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే యాప్స్ పనిచేయవు. అయితే, టెక్నికల్ సమస్యలు, సిస్టమ్ అప్‌డేట్స్ వంటి ఇబ్బందుల కారణంగా సోషల్ మీడియా సంస్థలు మరింత సమయం కోరాయి.ఈ నేపథ్యంలో కేంద్రం గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో, ప్రస్తుతం వినియోగదారులు సిమ్ లేకపోయినా యాప్స్‌ను కొనసాగించవచ్చు.ఇప్పటికే ఫిబ్రవరి 28తో గడువు ముగిసినా, సేవలు నిలిచిపోకపోవడం వల్ల సిమ్ బైండింగ్ నిబంధనలు ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదని స్పష్టమవుతోంది. త్వరలో టెక్నికల్ సమస్యలు పరిష్కారమైన తర్వాతే ఈ రూల్స్ పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. సామాన్యులకు మరో షాక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *