Breaking News

Choree at the former MLA Jaypal Yadav house

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

హైదరాబాద్: జూబ్లీహిల్స్ భరణీ లేఔట్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ ఘటనలో దుండగులు రూ.7.5 లక్షల నగదును అపహరించుకుపోయారు.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

ఈ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దొంగతనానికి సంబంధించి ఆధారాలను సేకరించేందుకు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.

జైపాల్ యాదవ్ నివాసంలో జరిగిన ఈ చోరీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *