కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ భరణీ లేఔట్లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ ఘటనలో దుండగులు రూ.7.5 లక్షల నగదును అపహరించుకుపోయారు.
ఈ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దొంగతనానికి సంబంధించి ఆధారాలను సేకరించేందుకు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.
జైపాల్ యాదవ్ నివాసంలో జరిగిన ఈ చోరీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
