Breaking News

High Court for Medical PG Candidates ..

మెడికల్ పీజీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట..

రేవంత్ ప్రభుత్వానికి షాక్: మెడికల్ పీజీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట

హైదరాబాద్, వెబ్‌డెస్క్:
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుతో మెడికల్ పీజీ అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకువచ్చిన జీఓ (ప్రభుత్వ ఉత్తర్వు)ను హైకోర్టు నిలిపివేస్తూ పీజీ మెడికల్ సీట్ల విషయంలో కీలక ప్రకటన చేసింది.

తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు ఊరట
హైకోర్టు తన తీర్పులో, తెలంగాణలో ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) పూర్తి చేసిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జీఓపై విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు, ప్రభుత్వ ఉత్తర్వును నిలుపుదల చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

వివాదాస్పద జీవోకు బ్రేక్
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం “ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు తెలంగాణలో పూర్తి చేసిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించకూడదు” అంటూ జీవో విడుదల చేసింది. దీనిపై విద్యార్థులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు వారి తరఫున తీర్పు ఇచ్చింది. “విద్యార్థుల హక్కులను కాలరాస్తే న్యాయం జరగదు” అంటూ ప్రభుత్వ ఉత్తర్వును కొట్టివేసింది.

విద్యార్థుల హర్షం
హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే మెడికల్ పీజీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. “తెలంగాణలో చదివాం.. కానీ స్థానికులుగా పరిగణించరాదనడం అన్యాయం” అని విద్యార్థులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేసిన హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

రేవంత్ రెడ్డి సర్కారుకు ఎదురుదెబ్బ
ఈ తీర్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవోకు బ్రేక్ పడింది. ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ సహా పలువురు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం తగదని వారు అంటున్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *