Breaking News

Has the reputation of gurukulas fallen? KTR is angry with the government

గురుకులాల ప్రతిష్ఠ పడిపోయిందా? ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

గురుకులాల ప్రతిష్ఠ పడిపోయిందా? ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్, డిసెంబర్ 29: పదేండ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎదిగిన గురుకులాల గౌరవం ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే ఎందుకు క్షీణించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గురుకుల విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు.

సర్కార్‌పై తీవ్ర విమర్శలు

గురుకుల పాఠశాలల నిర్వహణలో కక్ష్యా, శిక్ష్యా లేక నిర్లక్ష్యమా అంటూ ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా (X – ట్విట్టర్) కేటీఆర్ నిలదీశారు. మండలానికి ఒక్క గురుకుల పాఠశాల మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులలో అభద్రత భావం పెంచడం ప్రభుత్వ ఉద్దేశపూర్వక చర్యలా ఉందని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

విద్యార్థుల మరణాలు – ప్రభుత్వం మౌనం

గత ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “కామన్ డైట్” పేరుతో ఆరంభంలో అట్టహాసంగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

గురుకులాల స్థితిగతులపై ఆందోళన

కేసీఆర్ పాలనలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసిన కేటీఆర్, ఇప్పుడు విద్యార్థులు పాఠశాలలు విడిచి వెళ్లే పరిస్థితి ఎవరి కారణమని ప్రశ్నించారు. గురుకులాల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అసమర్థత కనబరుస్తోందని ఆయన ఆక్షేపించారు.

ప్రభుత్వానికి కేటీఆర్ సూచనలు

విద్యార్థుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని, వారి అవసరాలను తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ హితవు పలికారు. గురుకులాలకు ఆర్థిక, మౌలిక వసతులు మెరుగుపరిచి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *